లవ్ స్టోరీని 24న థియేటర్లోనే చూస్తా: అమీర్ ఖాన్

లవ్ స్టోరీని 24న థియేటర్లోనే చూస్తా: అమీర్ ఖాన్

నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నిర్మించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఈనెల 24వ తేదీన థియేటర్లోనే చూస్తానని బాలీవుట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం.. సాయి పల్లవి డ్యాన్సులు చాలా బాగుంటాయని ఆయన ప్రశంసించారు. ఆదివారం హైదరాబాద్ లో ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిరంజీవితోపాటు అమీర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది మిత్రులున్నారని అన్నారు. సాయిపల్లవి ఎపిసోడ్ చాలా బాగా నచ్చిందని అమీర్ ఖాన్ ప్రశంసించారు. 
సాయి పల్లవితో డ్యాన్స్ చేసి.. ఆ కిక్కును ఆస్వాదించాలనుంది: చిరంజీవి
లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలా కాలం తర్వాత సినీ వేదికపై చాలా సరదాగా ఛలోక్తులు విసురుతూ మాట్లాడిన చిరంజీవి.. సాయి పల్లవి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యానని మెచ్చుకున్నారు. ఒకసారి ఫిదా సినిమా చూస్తుంటే.. వరుణ్ తేజ్ వస్తూనే.. సినిమా ఎలా ఉంది డ్యాడీ అని అడిగాడు.. నేను సారీ వరుణ్.. నేను సాయి పల్లవిని చూస్తున్నానని చెప్పాను. ఫిదా సినిమాకు ముందు సాయి పల్లవి ఎవరో తెలియదు.. ఆ ఒక్క సినిమా చూసిన తర్వాత ఆమెకు ఫ్యాన్ అయిపోయానన్నారు. 
నా సినిమాలో ఒక చెల్లి పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని ప్రయత్నించారు.. నాకేమో..ఆమె నో అని చెబితే బాగుంటుందనుకున్నా.. అలాగే చెప్పింది.. ఎందుకంటే సాయి పల్లవి లాంటి డ్యాన్సర్ తో కలసి డ్యాన్స్ చేస్తే ఆ మజాయే వేరు.. గతంలో పెద్ద డ్యాన్సర్లెందరితోనే డ్యాన్సులు చేశా.. ఇప్పుడు సాయి పల్లవితో చేయాలనే కోరిక ఉంది.. తొందర్లోనే నెరవేరుతుందని అనుకుంటున్నానని చిరంజీవ అన్నారు.